Trisha Krishnan | తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లతోపాటు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత నటి త్రిష షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. బ్యాక్ గ్రౌండ్తో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ Ghilli songతో పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవడమే కాకుండా హాఫ్ మిలియన్కుపైగా లైక్స్ వచ్చాయి.
విజిల్ సౌండ్తో మొదలయ్యే అర్జునార్ విల్లు సాంగ్ను త్రిష ఎంపిక చేసుకోవడంతో విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్న టీవీకే చీఫ్ విజయ్కు మద్దతుగా నిలుస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్-త్రిష రిలేషన్షిప్లో ఉన్నారని కొంతకాలంగా నెట్టింట పుకార్లు షికారు చేస్తుండగా.. ఈ ఇద్దరిలో ఎవరూ కూడా దీనిపై కామెంట్ చేయలేదు. ఇటీవలే త్రిష-విజయ్ కలిసి ఓ వెడ్డింగ్కు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్కు సపోర్ట్గా త్రిష పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. త్రిష ప్రస్తుతం సూర్యతో కలిసి కరుప్పు సినిమాలో నటిస్తోంది. వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video