అంకారా, ఏప్రిల్ 2: టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబ్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో కనీసం 29 మంది చనిపోయారని స్థానిక మీడియా పేర్కొన్నది.
ఈ ఘటనకు సంబంధించి నైట్ క్లబ్ మేనేజర్లను, మరికొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 16 అంతస్తుల నివాస భవనం గ్రౌండ్, బేస్మెంట్ ఫ్లోర్లోని ‘మస్కరాడె నైట్ క్లబ్’ను ఆధునీకరణ కోసం మూసేశారు. ఇస్తాంబుల్ గవర్నర్ దావుత్ గుల్ ఘ టనా స్థలంలో మీడియాతో మాట్లాడు తూ, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏం టన్నది ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు సాగుతున్నదని అన్నారు.