లాహోర్: ప్రముఖ కవి జావెద్ అక్తర్ పాకిస్థాన్ను ఆ దేశంలోనే తీవ్రంగా విమర్శించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించిన ఆయన.. దాడికి బాధ్యులైన ఉగ్రవాదులు ఇంకా పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. దీని గురించి భారత్ మాట్లాడితే.. దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. లాహోర్లో జరిగిన ఏడవ ఫైజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో జావెద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సానుకూల, స్నేహపూర్వక దేశంగా శాంతి సందేశాన్ని భారత్కు తీసుకెళ్లాలని ప్రేక్షకుల్లో ఒకరు అడిగిన దానికి అక్తర్ పైవిధంగా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒకరిని ఒకరు నిందించుకోవాల్సిన అవసరం లేదని, దీనివల్ల ఎలాంటి సమస్య పరిష్కారం కాదని, పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అక్తర్ పేర్కొన్నారు.