వాషింగ్టన్ : ఐక్య రాజ్య సమితి వేదికగా పాక్ ఉగ్రవాద అనుకూల చర్యలను భారత్ ఎత్తిచూపింది. పీవోకేను వెంటనే ఖాళీ చేయాలని, ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని తెగేసి చెప్పింది. ఐరాస 78వ జనరల్ అసెంబ్లీలో మరోసారి కశ్మీర్ అంశాన్ని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ లేవనెత్తడంతో భారత్ దీటైన సమాధానం చెప్పింది. జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమని, దానిపై వ్యాఖ్యానించడానికి పాకిస్థాన్కు ఎలాంటి హక్కు లేదని యూఎన్లోని యూఎన్జీఏ ఫస్ట్ సెక్రటరీ పేటల్ గెహ్లాట్ స్పష్టంచేశారు.