బ్రసెల్స్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 2024 చివరి నాటికి అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, కెమెరాల్లో తప్పనిసరిగా ఒకే విధమైన టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండాలని యూర ప్ పార్లమెంట్ నిర్ధేశించింది. ఇందు కు సంబంధించి ఓ చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలో ఇలాంటి చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి.