బ్రసెల్స్, ఫిబ్రవరి 1: రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్కు ఐరోపా సమాఖ్య భారీ సాయం ప్రకటించింది. నాలుగేండ్లలో రూ.4 లక్షల కోట్లు అందజేయాలని సమాఖ్యలోని 27 దేశాల అధినేతలు నిర్ణయించారు. గురువారం బ్రస్సెల్స్లో జరిగిన సమావేశంలో సభ్య దేశాలు ఈ సాయానికి ఆమోదం తెలిపినట్టు ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ వెల్లడించారు. ఈయూ సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. సైనిక సహాయానికి ఇది ఏ మాత్రం తీసిపోదన్నారు.