వాషింగ్టన్: టెస్లా కంపెనీ ఓనర్, బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన 18 ఏళ్ల కుమారుడు జేవియర్ తన పేరును మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్గా మారిన ఆ పిల్లాడు పేరుతో పాటు జెండర్ కూడా మార్చుకోనున్నట్లు దరఖాస్తులో తెలిపాడు. కాలిఫోర్నియాలోని సాంటా మోనికా కోర్టులో ఈ అప్లికేషన్ ఫైల్ చేశాడు. జేవియర్ అలెగ్జాండర్ మస్క్ కు ఏప్రిల్లో 18 ఏళ్లు నిండాయి. కానీ ఇప్పుడు అతనికి తన తండ్రి మస్క్తో గడపాలని లేదు. అందుకే తన బర్త్ సర్టిఫికేట్లో పేరును మార్చాలనుకున్నాడు. మస్క్ ఇంటి పేరును తన పేరు నుంచి తీయాలనుకున్నాడు. ఇక ట్రాన్స్జెండర్ మహిళగా మారిన జేవియర్.. ఆ సర్టిఫికేట్లో తన లింగాన్ని కూడా మార్చాలని భావించాడు. వివియాన్ జెన్నా విల్సన్ అనే అమ్మాయి పేరును పెట్టుకోవాలని జేవియర్ ఆలోచిస్తున్నాడు. 2000లో జస్టిస్ విల్సన్ను మస్క్ పెళ్లాడు. ఆమెకు 2008లో విడాకులు ఇచ్చేశాడు. అయితే మొదటి భార్య విల్సన్, మస్క్ జంటకు ఏడు మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో జేవియర్ ఒకడు.