శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్పై ట్విట్టర్ నూతన అధిపతి ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ను తొలగిస్తామని బెదిరిస్తున్నదని, ట్విట్టర్లో యాపిల్ ప్రకటనలను నిలిపివేసిందని ఆరోపించారు. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా జరుగుతున్న లావాదేవీలపై ‘రహస్యం’గా 30% ఫీజును వసూలు చేస్తున్నదని మండిపడుతున్నవారితో మస్క్ కూడా గొంతు కలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వరుసగా పలు ట్వీట్లు చేసి, యాపిల్తో కయ్యానికి కాలు దువ్వారు. ఇకపై యాపిల్కు 30% చెల్లింపులను కొనసాగించడానికి బదులుగా ఆ సంస్థతో యుద్ధం చేస్తానని ప్రకటించారు. ట్విట్టర్కు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో అధిక భాగం యాపిల్ నుంచే వస్తున్నది. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా దాదాపు 150 కోట్ల పరికరాల్లో ట్విట్టర్ను వినియోగిస్తున్నారు.