శాన్ఫ్రాన్సిస్కో: ట్విట్టర్లోని దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాలని దాని బాస్ ఎలాన్మస్క్ భావిస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ఈ తొలగింపు ఫైనల్ అయితే 3,800 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తారని పేర్కొంది. వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కూడా రద్దు చేయాలని మస్క్ ఆలోచిస్తున్నట్టు వెల్లడించింది.
ఆఫీసులోనే ట్విట్టర్ ఉద్యోగుల నిద్ర!
ట్విట్టర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచీ టెస్లా అధినేత మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులపై పనిభారం పెంచేశాడని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజర్ ఎస్తర్ క్రాఫోర్డ్ ఆఫీసులో నేలపై నిద్రిస్తున్న ఫొటోను ఉద్యోగి ఎవాన్ జోన్స్ షేర్ చేశారు. ‘మీ బాస్ నుంచి మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఇలా ఉండాల్సిందే’ అని ట్యాగ్ తగిలించాడు.