న్యూఢిల్లీ : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ఇటీవల ట్విట్టర్ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు.. తర్వాత కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ‘కొకైన్ను తిరిగి తీసుకువచ్చేందుకు’.. కోకాకోలాను కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ 44 బిలియన్లకు ట్విట్టర్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని మస్క్ నగదు రూపంలో చెల్లించనున్నారు.
ఎలాన్ మస్క్ ప్రపోజల్పై సుదీర్ఘంగా చర్చించిన ట్విట్టర్ బోర్డు.. ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది. ట్విట్టర్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావించిన మస్క్ ముందుగా 9.2శాతం వాటా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 14న తన తుది ఆఫర్ను ట్విట్టర్ బోర్డు ముందుంచగా.. మొదట దీనికి నిరాకరించిన బోర్డ్.. ఆ తర్వాత అనేక ప్రయత్నాల అనంతరం మస్క్ ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడంతో ఇకపై ఓ ప్రైవేట్ సంస్థ యజమాని ఆధీనంలో పనిచేయనుంది.