Elon Musk | తన కొడుకు జీనియస్ అని టెస్లా అధినేత, ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ అన్నారు. ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో అందరినీ గందరగోలానికి గురి చేస్తున్నారు. దీంతో మస్క్పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో మస్క్కు ఆయన తల్లి మయే మస్క్ మద్ధతుగా నిలిచారు.
తన కొడుకు జీనియస్ అంటూ చెప్పుకొచ్చారు. ‘నా కొడుకు చాలా తెలివైనవాడు. అతనిపై విమర్శలు మానుకోండి. మస్క్ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేనివారే తనపై ఇలా విమర్శలు చేస్తున్నారు’ అని మయే మస్క్ అన్నారు. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న తర్వాత మస్క్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. తర్వాత ట్విట్టర్ బ్లూటిక్ కోసం 8 డాలర్లు చెల్లించాలని చెప్పడం ఇటీవల వివాదాస్పదమైంది. దీంతో మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.