వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేసిన ‘డోజ్’ బృందం వైట్ హౌస్లోని డేటాను భారీగా యాక్సెస్ చేసింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం.. ఈ డేటా ట్రాన్స్మిషన్ గోప్యంగా జరిగింది. దీనికి రికార్డులు కానీ, ఏ విధంగా ట్రాన్స్మిషన్ అయిందో గుర్తించే అవకాశం కానీ లేకుండాపోయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుమతితోనే ఇదంతా జరిగింది. అంతర్గత భద్రతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, డోజ్ టీమ్స్ పట్టించుకోలేదు. వైట్హౌస్ డేటాను మస్క్ కాపీ చేశారన్న ఆరోపణలను అమెరికన్ సీక్రెట్ సర్వీస్ తోసిపుచ్చింది. అయితే డోజ్ టీమ్పై ఈ తరహా ఆరోపణలు కొత్త కాదు.