పారిస్: ప్రపంచంలోని ఇద్దరు మేటి సంపన్నులు(Billionaires) ఒకే దగ్గర విందులో పాల్గొన్నారు. టాప్ రెండు స్థానాల్లో ఉన్న ఎలన్ మస్క్, బెర్నార్డ్ అర్నాల్ట్లు శుక్రవారం పారిస్లో తమ కుటుంబసభ్యులతో కలిసి లంచ్ చేశారు. ఆ ఇద్దరు కుబేరుల సంపద సుమారు 470 బిలియన్ల డాలర్లు ఉంటుంది. టెస్లా సీఈవో మస్క్ తన తల్లి మేయి మస్క్తో, లుయిస్ విట్టాన్ సీఈవో బెర్నార్డ్ తన ఇద్దరు కుమారుడు ఆంటోయిన్, అలెగ్జాండర్ అర్నాల్ట్తో కలిసికట్టుగా లంచ్ చేశారు. ఆంటోయిన్ అర్నాల్ట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో లంచ్కు చెందిన ఫోటోలు పోస్టు చేశారు. మస్క్ సంపద సుమారు 236 బిలియన్ల డాలర్లు కాగా, బెర్నార్డ్ సంపద 233 బిలియన్ల డాలర్లు. ఆ ఇద్దరి సంపద దాదాపు 470 బిలియన్ల డాలర్లు ఉంటుంది.