Karachi : అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) బలగాలు చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతిచెందడంపై పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ (Karachi) లో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. ఖమేనీ హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున కరాచీలోని ఆమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకొచ్చారు.
పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా రాళ్లు రువ్వారు. బారీకేడ్లను తోసుకుంటూ కాన్సులేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెరువలేదు. ఇంకా పెద్ద సంఖ్యలో నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆందోళనకారులు తిరగబడ్డారు. ఈ ఘర్షణల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.