లండన్: ఈజిప్ట్కు (Egypt) చెందిన బిలియనీర్ (Billionaire) మొహమ్మద్ అల్-ఫయద్ (Mohamed al-Fayed) కన్నుమూశారు. 94 ఏండ్ల అల్ ఫయెద్ వయస్సురీత్యా అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో (Alexandria) జన్మించిన అల్ ఫయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ (Fizzy drinks) అమ్మకాలతో వ్యాపారరంగంలో అడుగుపెట్టారు. అనంతరం కుట్టుమిషన్ల సేల్స్మెన్గా పనిచేశారు. ఆ తర్వాత రియల్ఎస్టేట్, షిప్పింగ్, నిర్మాణ రంగాల్లో దూసుకెళ్లారు. మొదట మధ్యప్రాచ్యంలో వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ.. క్రమంగా ఐరోపాకు విస్తరించారు. హరాడ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ (Harrods department store), ఫుల్ హామ్, పారిస్లో రిట్జ్ హోటల్ను స్థాపించారు. వ్యాపార రంగంలో చేసిన సేవలకుగాను ఫ్రాన్స్ (France) అత్యున్నత పౌరపురస్కారం ‘లెజియన్ ఆఫ్ హానర్’తో (Legion of Honour) సత్కరించింది.
కాగా, 1997లో అల్ ఫయెద్ కుమారుడు దోషి ఫయెద్.. ప్రిన్సెస్ డయానాతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించాడు. అయితే దోడీ కారణంగా డయానా బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలియడంతో ఆమె భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్ కారు ప్రమాదం పేరిట హత్య చేయించాడని అల్ ఫయెద్ ఆరోపించారు. వారి మరణం వెనుక బ్రిటిష్ రాజకుటుంబం హస్తం ఉందని ఫయెద్ చాలాకాలంపాటు న్యాయ పోరాటం చేశారు. అయితే సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆ కేసు కోర్టుల్లో నిలబడలేకపోయింది. కాగా, బ్రిటన్ పౌరసత్వం ఇవ్వడానికి రాజకుటుంబం తిరస్కరించడంతో ఆయన ఎప్పుడూ యూరప్ వెళుపలే ఉండేవారు. అయితే దోడి, డయానాల 26వ వర్ధంతికి ఒక రోజు ముందు అల్ ఫయెద్ మరణించడం గమనార్హం.