సముద్రంలోకి వెళ్లిన ఒక 68 ఏళ్ల వృద్ధురాలిపై షార్క్ దాడి చేసింది. ఆ గాయాలతో ఒడ్డుకు ఈదుకొచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లే దారిలో అంబులెన్సులోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్న అన్ని బీచ్లను మూసేసింది. ఈ ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది.
ఆస్ట్రియాకు చెందిన ఈజిప్టులో సాహీ హషీష్ సమీపంలోని సముంద్రంలో సదరు మహిళ ఉండగా.. షార్క్ దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఎలాగోలా ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేసింది. ఆమెను చూసిన వాళ్లు.. వృద్ధురాలి చెయ్యి, కాలిపై తీవ్రమైన గాయాలు చూశారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన అంబులెన్సు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె కన్నుమూసింది. దీంతో రెడ్ సీకి సంబంధించిన చాలా బీచ్లు మూసేయాలంటూ ఎర్ర సముద్రం గవర్నరేట్ ఆదేశాలు జారీ చేసింది.