లిమా : పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.5తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. బరాన్కాకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నది. అయితే, భారీ భూంకంపం ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టగా.. భవనాలు ఊగిపోయాయి.
రాజధాని లిమాకు దూరంగా, భూమికి వంద కిలోమీటర్ల లోతులో సంభవించిందని, అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూరో-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ట్వీట్లో తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది.
ఇంతకు ముందు 06.32 గంటల ప్రాంతంలో కల్లావోకు పశ్చిమాన 258 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురవగా.. ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. అయితే, ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోగా.. సీసీటీవీల్లో దృశ్యాలు రికార్డయ్యాయి.