వాషింగ్టన్, అక్టోబర్ 3: సముద్రజలాలు వేడెక్కడం వల్ల భూగ్రహం ఎల్బిడోను (ప్రకాశించే గుణం) క్రమంగా కోల్పోతున్నదని అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి చదరపు మీటరు భూభాగం.. 20 ఏండ్ల క్రితంతో పోలిస్తే, సగం వాట్కు సమానమైన ఎల్బిడోను కోల్పోయినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం భూమి సగటు ఎల్బిడో కంటే 0.5 శాతం తక్కువ అని వెల్లడించారు. గత మూడేండ్లుగా ఉపగ్రహాల ద్వారా సేకరించిన డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని గమనించినట్టు తెలిపారు. సముద్రజలాలు వేడెక్కడం, వాతావరణ మార్పులే ఎల్బిడో క్షీణించడానికి ప్రధాన కారణమని వివరించారు. సూర్యరశ్మి ద్వారా గ్రహించే కాంతిలో 30 శాతాన్ని భూమి పరావర్తనం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ పరావర్తన కాంతి చంద్రుడిపై ప్రసరించడంతో అక్కడి ఉపరితలం కొంతవరకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.