ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్ సమయంలోనే చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ డోస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఒమిక్రాన్ విషయంలో డబుల్ బూస్టర్ అవసరమా? అని కొందరు ఆలోచించారు.
ఈ క్రమంలోనే కరోనా సోకి, ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిన వారికి వ్యాక్సిన్ నాలుగో డోసు ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా డబుల్ బూస్టర్ డోస్కు అనుమతి ఇచ్చిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ దేశంలో ఒమిక్రాన్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వారికి నాలుగో డోస్ వ్యాక్సిన్ ఇస్తామని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ తెలిపారు. ఇప్పటి వరకూ ఈ దేశంలో 42 లక్షలపైగా ప్రజలు మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.