మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి(Drone Attack) చేసింది. అయితే ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు. నాన్-రెసిడెన్షియల్ బిల్డింగ్లపై రెండు యూఏవీలు అటాక్ చేసినట్లు తెలుస్తోంది. మాస్కోపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయ ఉగ్రవాదం అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి మారియా ఆరోపించారు. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు మాస్కోపై డ్రోన్ అటాక్ జరిగింది.
అయితే ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా రష్యా ఆర్మీ ఆ డ్రోన్లను నేలకూల్చింది. మాస్కో సెంటర్లో ఉండే కాంసోమాలస్కీ ప్రోస్పెక్ట్ బిల్డింగ్ వద్ద డ్రోన్లు హల్చల్ చేశాయి. డ్రోన్ పేలుడు ధాటికి బిల్డింగ్లో ఉన్న అద్దాల కిటికీలు పగిలిపోయాయి. దక్షిణ మాస్కోలో ఉన్న బహుళ అంతస్థు భవనంపై రెండో డ్రోన్ దాడి చేసింది. ఆ రూట్లో రోడ్డును మూసివేశారు.