ఏడు నెలల చిన్నారికి ఓ డాక్టర్ పొరపాటున కరోనా టీకా వేశాడు. ఈ సంఘటన శనివారం దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలో ఉన్న సియోంగ్నామ్ పట్టణంలో ఒక చిన్న పిల్లల డాక్టర్ పొరపాటున శిశువుకు మోడెర్నా టీకా వేశాడు.
ఆ టీకా శిశువు తల్లికి ఇవ్వాల్సి ఉండగా.. పొరపాటు జరిగిందని అని లోకల్ మీడియా తెలిపింది. తప్పుతెలుసుకున్నాక శిశువుకు ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఆ చిన్నారికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు కనిపించలేదని అధికారులు తెలిపారు.
డాక్టర్ చేసిన పొరపొటుకు ఆ శిశువు తల్లిదండ్రులు అతనిపై కేసు పెట్టినట్లు సమాచారం.