ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 28 : అనుమానాస్పద స్థితిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందా డు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరి ధి బాలాజీనగర్లో ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాలు ప్రకారం..ఘట్కేసర్ మున్పిపాలిటీ పరిధి బాలాజీనగర్లో నివాసం ఉంటున్న పాలాడి పురుషోత్తం(38) ఆర్ఎంపీ డాక్టర్. స్థానికంగా పాలిక్లినిక్ నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. పురుషోత్తం భార్య ఇటీవల ముంబాయిలో తల్లిదండ్రుల ఇంటికి డెలివరీ కోసం వెళ్లింది. రోజు ఫోనులో మాట్లాడే పురుషోత్తం ఈ నెల 25 నుం చి మాట్లాడకపోవడంతో ఆందోళనకు గురైన మృతుడి భార్య బోడుప్పల్లో నివాసం ఉంటు న్న బంధువులకు సమాచారం ఇవ్వగా హరిశ్ అనే యువకుడు బుధవారం ఉదయం పురుషోత్తం ఇంటికి వచ్చి చూడగా తలుపుకు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. వెనుకాల తలుపు తెరుచుకుని ఉన్నట్లు గమనించి వెళ్లి చూడగా కుళ్లిపోయిన దశలో పురుషోత్తం శవం పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.