Fiber Foods | లండన్: చక్కని జీర్ణ వ్యవస్థకు, సంపూర్ణ ఆరోగ్యానికి పీచు(ఫైబర్) అవసరం. రోజూ ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే60 ఏండ్లు పైబడినవారిలో మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. లండన్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ కోర్స్, పాపులేషన్ సైన్సెస్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం వా రు 36 వృద్ధ జంటల ఆహారపు అలవాట్లను, వారి జీవన విధానాన్ని పరిశీలించారు. నిత్యం పీచు పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు పటిష్ఠం కావడంతో పాటు మెదడు చురుగ్గా పని చేస్తుందని తెలిపారు. ‘కేవలం 12 వారాల్లో మార్పు రావడం గమనించి మేము ఆశ్చర్యపోయాం.
పేగులు(గట్)-మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తే దీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా బతికే మార్గాలు కనిపిస్తున్నాయి’ అని డాక్టర్ ని లోచ్లాయిన్ తెలిపారు. మొక్కలు, ఆకుకూరల్లోని పీచు మెదడు ఆరోగ్యానికి ఎంతో దోహ దం చేస్తుందని సైంటిస్టులు తెలిపారు. పీచు కలిగిన పదార్థాలు తిన డం వల్ల గట్ మైక్రోబియమ్(అన్ని అవయవాలపై ప్రభావం చూపే జీర్ణ వ్యవస్థ)లో మెరుగైన మార్పులు వచ్చాయి. ఇవి మెదడు పనితీరుపైనా సానుకూల ప్రభావాన్ని చూపించాయి. అయితే పీచు ప్రభావం దీర్ఘ కాలం ఉంటుం దా, ఎక్కువ మందిపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.