ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్సైట్లపై ఇవాళ సైబర్ అటాక్ జరిగింది. డజన్ల సంఖ్యలో సైట్లను టార్గెట్ చేశారు. ఎంబసీలను కూడా హ్యాక్ చేశారు. విదేశాంగ, విద్యాశాఖ సైట్లను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. యూకే, యూఎస్, స్వీడన్ ఎంబసీ సైట్లపై సైబర్ దాడులు జరిగాయి. అయితే ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. రెండు దేశాల సరిహద్దు మధ్య సుమారు లక్ష మంది దళాలను రష్యా మోహరించింది. గడిచిన 9 నెలల్లో సుమారు 1200 సైబర్ దాడులను నిర్వీర్యం చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూర్టీ సర్వీస్ పేర్కొన్నది. ఇవాళ జరిగిన సైబర్ దాడికి ముందు.. చాలా దారుణం జరగనున్నట్లు ఓ వార్నింగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఉక్రెయిన్ ప్రజలరా.. మీ పర్సనల్ డేటా మొత్తం పబ్లిక్గా అప్లోడ్ చేసినట్లు వార్నింగ్ మెసేజ్లో తెలిపారు.