టెహ్రాన్: ఇరాన్లోని 70 శాతం గ్యాస్ స్టేషన్లలో సేవలు సోమవారం నిలిచిపోయినట్లు ప్రభుత్వ టీవీ తెలిపింది. సాఫ్ట్వేర్ సమస్య వల్ల సేవలకు విఘాతం కలిగినట్లు చెప్పింది. ఇది సైబర్ దాడి అయి ఉండవచ్చునని తెలిపింది. ప్రస్తుతం పని చేస్తున్న గ్యాస్ స్టేషన్లకు పెద్ద సంఖ్యలో వెళ్లవద్దని ప్రజలను కోరింది. అయితే ఇజ్రాయెల్ మీడియా మాత్రం ఈ సమస్యకు కారణం హ్యాకర్లేనని ఆరోపించింది. గొంజష్కే డరాండే లేదా ప్రిడేటరీ స్పారో సైబర్ దాడి చేసి ఉండవచ్చునని తెలిపింది. ఇరాన్లోని గ్యాస్ స్టేషన్లు, రైల్వేలు, పరిశ్రమలపై సైబర్ దాడులు ఇటీవల పెరుగుతున్నాయి.