లండన్: మీరు రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నారా. రెండేళ్ల నుంచి వ్యాయామం అసలే అలవాటు లేనివాళ్లను కోవిడ్ బలి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కదలికలేని జీవితాన్ని గడుపుతున్నవారిలోనే కరోనా తిష్టవేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శారీరీక శ్రమ లేని వారిలో ఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు. వారిలోనే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయనం ద్వారా వెల్లడించారు. సుమారు 50 వేల మంది వైరస్ బాధితులను స్టడీ చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. మహమ్మారి కన్నా రెండేళ్ల ముందు నుంచి ఎటువంటి శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేని వారు ఎక్కువ శాతం హాస్పిటల్లో చేరుతున్నట్లు స్పోర్ట్స్ మెడిసిన్ బ్రిటీష్ జర్నల్ పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు. కోవిడ్ వ్యాధి సీరియస్గా ఉందంటే వారు వ్యాయామానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. శారీరక శ్రమ లేని ముసలివాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్నవాళ్లలోనూ కోవిడ్ విషమ స్థాయిలో విజృంభిస్తోందని పరిశోధకులు చెప్పారు. ధూమపానం, ఊబకాయం, హైబీపీ కన్నా.. శారీరక శ్రమ లేకపోవడమే అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని సైంటిస్టులు తెలిపారు.