వాషింగ్టన్: కొవిడ్-19 వైరస్ మానవుల నుంచి జింకలకు సోకుతున్నదని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. కొవిడ్ వైరస్ జంతువుల్లో పెద్దయెత్తున విస్తరిస్తున్నదని, జన్యు పరివర్తనం (మ్యుటేషన్లు) చెందుతున్నదని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యునికేషన్’లో ప్రచురితమయ్యాయి. ఒహియోలోని 1,522 జింకల ముక్కు నుంచి ‘స్వాబ్’ను శాస్త్రవేత్తలు సేకరించి జన్యుపరమైన విశ్లేషణ చేసి ఈ మేరకు తేల్చారు. జింకల శరీరంలో 6 నుంచి 9 నెలలపాటు వైరస్ ఉంటుందని, దీంతో అవి అనారోగ్యం బారినపడవని ప్రొఫెసర్ ఆండ్రూ బోమాన్ తెలిపారు.