Xi Jinping | కొవిడ్-19పై పోరు కొత్త దశలోకి చేరిందని, మహమ్మారిని అధిగమించడం అంత తేలిక్కాదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తేల్చి చెప్పారు. కఠినమైన సవాళ్లు పొంచి ఉన్నాయని నూతన సంవత్సరం సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో కరోనా కొత్త వేవ్పై ఆందోళనతో భారత్తోపాటు పలు దేశాలు ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో చైనాలో ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి తీవ్రతపై మరింత సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోరిందన్నారు.
కొవిడ్-19ను ఎదుర్కొంటూ ముందుకు సాగడం అంత తేలిక్కాదని జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. అసాధారణమైన సమస్యలు, సవాళ్లు ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. కొవిడ్ నియంత్రణకు అసాధారణ చర్యలు తీసుకున్నా, సమస్యలూ సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. కానీ చైనాలో కరోనా తీవ్రతపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొవిడ్ తీవ్రత గురించి ఇటీవలి కాలంలో జిన్పింగ్ తీవ్రంగా స్పందించడం ఇది రెండోసారి.