బ్యాంకాక్: దీర్ఘకాలంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి, ఆకాశాన్నంటుతున్న ధరలు.. ఆసియాలో లక్షలాది మంది ఆహార భద్రతపై పెను ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 180 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) పేర్కొంది. కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో 2020లో చాలా మంది ఆహారం విషయంలో ఇబ్బందులు పడ్డారని, ఈ ఏడాది ఆ పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది. ఆరోగ్యానికి కీలకమైన వెజిటబుల్ నూనెల ధరలు 74 శాతం పెరిగాయని ఎఫ్ఏవో సీనియర్ ఆర్థికవేత్త డేవిడ్ డావే పేర్కొన్నారు.