విద్యానగర్, ఏప్రిల్ 27 : కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డిలో ఎస్సైగా పనిచేస్తున్న గణపతి (53) కరోనాబారిన పడి, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఆయన ఆరు నెలల క్రితమే సిద్దిపేట నుంచి బదిలీపై కామారెడ్డికి వచ్చారు.