ఖలీల్వాడి, మార్చి 23 :ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ(క్షయ). దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. గతంలో ఈ వ్యాధి నివారణకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండేవి కావు. కానీ, ప్రస్తుతం అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక దశలోనే గుర్తిసే నివారణ అత్యంత సులువని, మందులు వాడడంలో నిర్లక్ష్యం వీడితేనే క్షయ నివారణ సాధ్యమని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి నిర్ధారణ :
క్షయ వ్యాధిని మొదటి దశలో ఉదయం వ్యాధిగ్రస్తుడు ఉమ్మిన తెమడను పరీక్షించి నిర్ధారిస్తారు. ఎక్స్రే ద్వారా సైతం నిర్ధారించవచ్చు. కలర్ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీబీనాట్ అనే పరీక్ష ద్వారా రెండు గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. కానిట్రెడ్జ్ బెస్ట్ న్యూక్లిక్ ఆసిడ్ ఆంప్లిఫికేషన్ (సీబీనాట్) పరీక్ష విధానంలో తెమడ పరీక్ష కాకుండా మిగతా డయాలాజికల్ నమూనాలు అన్నింటినీ తీసుకొని పరీక్ష చేస్తారు. తద్వారా సత్వర నిర్ధారణతో పాటు ఈ పరీక్ష ద్వారా ఎండీఆర్, టీబీగా నిర్ధారణ అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో టీబీ..
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు టీబీ సోకే అవకాశం మెండుగా ఉంటుంది. 60శాతం హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ సోకుతుంది. వీరిలో ఒకరోజు కన్నా ఎక్కువ దగ్గు , జ్వరం ఉండడం, రాత్రివేళల్లో చెమటలు పట్టడం, అకారణంగా నీరసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వారికి టీబీ సోకినట్లుగా నిర్ధారించవచ్చు.ఈ లక్షణాలు ఉన్నవారు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
నిర్ధారణ.. చికిత్సా కేంద్రాలు
క్షయవ్యాధి నిర్ధారణ కేంద్రాలు జిల్లాలో పలు పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్లు 16 ఉన్నాయి. ముఖ్యంగా 1. జిల్లా జనరల్ దవాఖాన అర్బన్లో క్షయ నియంత్రణ కేంద్రాల్లో, 2. మాలపల్లి అర్బన్, 3. ఆర్మూర్ సీహెచ్సీ, 4. నందిపేట్ పీహెచ్సీ, 5. బాల్కొండ పీహెచ్సీ 6. ప్రగతిదవాఖాన 7. కమ్మర్పల్లి, 8. భీమ్గల్, 9. డిచ్పల్లి, 10. వర్ని, 11. ధర్పల్లి, 12. కోటగిరి, 13. బోధన్, 14. నవీపేట్, 15. ఎడపల్లి, 16. మెడికల్ కళాశాల్లో పరీక్షలు చేస్తారు. వీటిలో తెమడ పరీక్షలు నిర్వహిస్తారు. క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో చికిత్స అందిస్తారు.
కరోనాతో తక్కువ కేసులు నమోదు
జిల్లాలో కరోనా మహమ్మారితో ప్రజలు మాస్కులు ధరించడంతో టీబీ కేసులు తక్కువగా నమోదయ్యాయి. జిల్లా యంత్రాంగం ప్రతి సంవత్సరం విస్తృతంగా వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎక్స్రే కేంద్రాలు
క్షయ నిర్ధారణకు నాలుగు ఎక్స్రే కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనరల్ దవాఖాన, ఆర్మూర్ (సీహెచ్సీ), బోధన్( ఏరియా వైద్యశాల), ధర్పల్లి (సీహెచ్సీ)ల్లో ఎక్స్రే కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జ నాభాలో లక్షకు రెండు నుంచి మూడు కేసులు న మోదు అవుతాయని క్షయ నియంత్రణాధికారు లు చెబుతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ని యంత్రణ కేంద్రాల లెక్కల ప్రకారం 1046 మం ది క్షయ నివారణ మందులను వాడుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టిన పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లేదా రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరా దు. ఉమ్మితే దానిపై మట్టిని కప్పాలి. ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఆరేండ్లలోపు పిల్లలు ఉంటే వారికి వైద్యుడి సలహా మేరకు ఐసోనియోజైడ్ మందులను ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు వైద్యుడి సలహా మేరకు నిర్ణీత సమయం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపిస్తే మందులు వేసుకోవడం మానరాదు. కోర్సు మధ్యలో మందులు మానేస్తే అవి శరీరంపై పనిచేయకుండా పోతాయి. ఇలాంటి సమయంలో వ్యాధిని నివారించడం కష్టతరమవుతుంది. వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్న సమయంలో యాక్షన్, రియాక్షన్ ఏమీ ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.