COVID19 | లండన్: రానున్న పదేండ్లలో కొవిడ్ తరహాలో మరో మహమ్మారి సంభవించేందుకు 27.5 శాతం అవకాశం ఉన్నదని లండన్కు చెందిన ప్రిడెక్టివ్ హెల్త్ అనలటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ వెల్లడించింది. పలు రకాల వైరస్లు తరచుగా ఉద్భవిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవచ్చని తెలిపింది.
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం వలన మరణాలను తగ్గించవచ్చునని అభిప్రాయపడింది. పర్యావరణ మార్పులు, పెరిగిన అంతర్జాతీయ ప్రయాణాలు, జనాభా పెరుగుదల, జొనొటిక్ వ్యాధుల(జంతువుల నుంచి వ్యాపించేవి) వల్ల కలిగే ముప్పు మరో ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 11,109 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరిందని చెప్పింది.