సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి బుధవారం కింగ్కోఠి దవాఖానను సందర్శించారు. కొవిడ్ రోగులను కలిసి వారి బాగోగులు ఆడిగి తెలుసుకున్నారు. ఎవ్వరూ ఆధైర్యపడొద్దని, మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రోగులకు భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం కరోనా సేవలపై వైద్యులతో ఆమె మాట్లాడారు. పారిశుధకార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, గన్ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.