మాంట్రియాల్, డిసెంబర్ 19: చరిత్రాత్మక జీవవైవిధ్య ఒప్పందానికి కాప్-15 ఆమోదం తెలిపింది. కెనడాలోని మాంట్రియాల్లో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 200 దేశాలు దీనికి సమ్మతిని తెలియజేశాయి. 1970 తర్వాత 69 శాతం జీవవైవిధ్యం అంతరించిపోయింది. మరింత ప్రమాదం జరగకముందే వన్యప్రాణులు, పక్షులు, క్షీరదాలు, సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సదస్సులో అన్ని దేశాలు పేర్కొన్నాయి. కాగా, ఎన్నో చర్చల అనంతరం నాలుగేండ్ల తర్వాత ఈ ఒప్పందం జరగటం విశేషం.