తైవాన్: చైనా, తైవాన్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. గత 40 ఏళ్లలో ఎన్నడూలేనంతగా చైనాతో సైనిక సంబంధాలు హీనస్థితికి పడిపోయినట్లు తైవాన్ రక్షణ మంత్రి వెల్లడించారు. 2025 నాటికి తైవాన్ దీవుల్ని డ్రాగన్ దేశం ఆక్రమించే అవకాశాలు ఉన్నట్లు రక్షణ మంత్రి చియూ కూ చెంగ్ తెలిపారు. గడిచిన వారం వరుసగా నాలుగు రోజుల పాటు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా తన సైనిక విమానాలను రికార్డు సంఖ్యలో పంపింది. దీంతో ఆ రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా భావిస్తుంది. కానీ చైనా మాత్రం తైవాన్ తమ రాజ్యంలో భాగమన్న రీతిలో వ్యవహరిస్తోంది. తైవాన్ను తమ దేశంలో ఏకీకృతం చేసేందుకు వీలైతే సైనిక చర్యకు కూడా పాల్పడుతామని ఇటీవల చైనా పేర్కొన్న విషయం తెలిసిందే.