Nikki Haley on Afghan | చైనాతో అమెరికా జాగ్రత్తగా ఉండాలని ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాలిబన్లు టేకోవర్ చేసిన తర్వాత ఆఫ్ఘన్లోని బాగ్రాం వైమానిక దళ స్థావరాన్ని చైనా ఆక్రమించుకునే అవకాశం ఉందని నిక్కీ హేఈల గురువారం మీడియాతో అన్నారు. ఆఫ్ఘన్పై పట్టు సాధించిన మీద.. భారత్కు వ్యతిరేకంగా పాక్ను మరింత బలోపేతం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ముందు పలు సవాళ్లు పొంచి ఉన్నాయని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణతో జో బైడెన్ ఆమెరికా సంకీర్ణ సేనల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. దేశ సైబర్ సెక్యూరిటీతోపాటు అమెరికన్లను రక్షించడానికి బైడెన్ సర్కార్ పని చేయాల్సిన అవసరం ఉందని నిక్కీ హేలీ తెలిపారు.
గత జూలైలో బాగ్రాం వైమానిక దళ స్థావరాన్ని అమెరికా సేనలు వీడాయి. వేలాది మంది అమెరికన్ సేనలకు వసతి కల్పించిన ఎయిర్ బేస్ ఇది. ఆఫ్ఘనిస్థాన్లో ఇది కీలక స్థావరం.
మన మిత్రపక్ష దేశాలను బలోపేతం చేయాలి, వారితో సంబంధాలను పటిష్ఠం చేయాలి. మన మిలిటరీని ఆధునీకరించాలి. మనకు సైబర్ దాడులు, ఉగ్రదాడుల ముప్పు ఉంది
అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాను అడ్డుకునేందుకు భారత్, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు, కీలక స్నేహితులతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పని చేయాల్సి ఉందన్నారు.