బీజింగ్, మే 22: అంగారక గ్రహంపైకి చైనా తొలిసారిగా ప్రయోగించిన రోవర్ ‘జురోంగ్’.. ల్యాండర్ నుంచి విడిపోయి మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ అరుణగ్రహంపై తన అన్వేషణను మొదలుపెట్టింది. మూడు నెలలపాటు ఇది మార్స్పై పరిశోధనలు నిర్వహించనుంది. అంగారకుడి ఉపరితలం తీరుతెన్నులు, నీటిజాడ, జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించనున్నది.