వుహాన్ : కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌన్ విధించింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 5,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్లోనూ వైరస్ విజృంభిస్తున్నది. నగరంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో నగరాన్ని వీడుతున్నారు.
చైనాలోని జిలిన్ సిటీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ హాస్పిటల్ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది.
కేవలం 6 రోజుల్లోనే 6000 బెడ్స్తో ఈ హాస్పిటల్ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం అయింది. జిలిన్ సిటీలో హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. జిలిన్ ప్రావిన్స్లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి.