షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. కొవిడ్ టెస్టులు చేయించుకునేందుకు మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలు తమ ఇండ్ల పరిధిలోని ఓపెన్ ఏరియాల్లో కూడా నడవకూడదని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు చెప్పారు.