బీజింగ్, మే 22: సంకరజాతి వరి వంగడాల సృష్టికర్త, చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ (91) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు శరీరంలో పలు అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. హైబ్రిడ్ వడ్ల తయారీలో పరిశోధనలకుగాను ఆయనను ‘ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్’ అని పిలుస్తారు. 1973లో ఆయన తొలిసారి సంకరజాతి వరి వంగడాలను అభివృద్ధి చేశారు.