లండన్: క్వీన్ ఎలిజబెత్ పార్దీవదేహానికి వెస్ట్మినిస్టర్ హాల్లో నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే నివాళి అర్పించేందుకు వచ్చిన చైనా ప్రతినిధులకు అనుమతి దక్కలేదు. వెస్ట్మినిస్టర్ హాల్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చైనా కోరగా, ఆ అభ్యర్థనను హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోలే నిరాకరించారు. బ్రిటన్కు చెందిన అయిదుగురు ఎంపీలపై చైనా గతంలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం వరకు ఎలిజబెత్ శవపేటిక వెస్ట్మినిస్టర్ హాల్లోనే ఉండనున్నది. ప్రపంచ దేశాధినేతలు క్వీన్ ఎలిజబెత్కు నివాళి అర్పించేందుకు అక్కడకు రానున్నారు.