China | బీజింగ్: యుద్ధరంగాన్ని సమూలంగా ప్రభావితం చేయగల అద్భుత టెక్నాలజీని ఆవిష్కరించినట్టు చైనా తెలిపింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలో తిరుగులేని విజయం సాధించామని పేర్కొన్నది. ‘యుద్ధరంగంలో ఎక్కడ దాక్కున్నా పసిగట్టి ధ్వంసం చేయగలం’ అని ప్రకటించింది.
భవిష్యత్తులో యుద్ధాల్లో ఎలక్ట్రానిక్స్దే కీలకపాత్ర అని భావిస్తున్నారు. దీంతో ఈ రంగంపై దృష్టిపెట్టిన చైనా శాస్త్రవేత్తలు.. యుద్ధరంగంలో శత్రువు ఎక్కడ దాక్కున్నా పసిగట్టి నాశనం చేయగల సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపింది. ఈ సాంకేతికత శత్రువుల ఎలక్ట్రానిక్ సిగ్నళ్లను అడ్డుకొని నాశనం చేస్తుందని తెలిపింది.