కోతులు, చింపాంజీలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. చింపాంజీలు అయితే మనిషిలాగే అరటిపండ్లు తినడం, ఏడ్వడం చేస్తుంటాయి. కాగా, పార్కులో ఓ చింపాంజీ ఓ అడుగు ముందుకేసి అచ్చం మనుషుల్లాగే చేపపిల్లలకు ఆహారం అందించింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను బిటింగెబిడెన్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో చింపాంజీ పార్కులో చేపలున్న కొలను గట్టున ఓ బౌల్లో ఆహారం తీసుకుని కూర్చుంది. చేపపిల్లలకు ఆహారం వేస్తూ అవి తింటున్నాయో లేదో పరిశీలిస్తోంది. చింపాంజీ ఆహారం వేయగానే చేపపిల్లలన్నీ వచ్చి ఆహారం తిని వెళ్లిపోతున్నాయి. ఈ వీడియోను ఇప్పటివరకూ 7లక్షల మంది వీక్షించారు. 37వేల లైక్స్ వచ్చాయి.
Feeding the fish.. 😊 pic.twitter.com/tFVz55frZx
— Buitengebieden (@buitengebieden) June 17, 2022