వాషింగ్టన్, మార్చి 25: భారత్లో సీఏఏ, మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ షికాగో నగర కౌన్సిల్లో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం 26-18 ఓట్లతో వీగిపోయింది. అమెరికాలో న్యూయార్క్ తర్వాత శక్తివంతమైన నగర కౌన్సిళ్లలో షికాగో ఒకటి. భారత్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలియదు కాబట్టి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి చాలామంది సభ్యులు సుముఖత వ్యక్తం చేయలేదని షికాగో మేయర్ లోరి లైట్ఫుట్ తెలిపారు.