బెర్లిన్, జూన్ 12: జర్మనీలోని ఫుర్త్లో గల సెయింట్ పాల్స్ చర్చిలో ఫాదర్కు బదులు ఆధ్యాత్మిక ప్రసంగం చేసి శభాష్ అనిపించుకుంది చాట్జీపీటీ! నాలుగు ఏఐ అవతార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్తమానంలో జీవించడం, జీసస్పై విశ్వాసం ఉంచడం, మరణానికి భయపడకపోవడం వంటి అంశాలను స్పృశిస్తూ 40 నిముషాల పాటు సాగిన చాట్జీపీటీ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వినేందుకు 300 మంది భక్తులు హాజరయ్యారు.