వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యం భయంతో ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సంస్థ.. సీఈవో సుందర్ పిచాయ్కు మాత్రం కళ్లు చెదిరే రీతిలో వేతనాన్ని ఇస్తున్నది. తాజాగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో గూగుల్ చేసిన ఫైలింగ్ ప్రకారం సుందర్ పిచాయ్ 2022లో రూ.1,854 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు.
గత మూడేండ్లుగా సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.16 కోట్లుగా స్థిరంగా ఉంటున్నా మిగతాదంతా స్టాక్ అవార్డు రూపంలో పెద్ద మొత్తంలో ఆయనకు వేతనంగా లభిస్తున్నది. గూగుల్లో పని చేసే మిగతా అందరూ ఉన్నతోద్యోగుల కంటే సుందర్ వేతనం చాలా రెట్లు అధికం. కాగా, ఖర్చులు తగ్గించుకునేందుకు గానూ ఇటీవల గూగుల్ 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.