లండన్: చిప్స్, చికెన్ నగ్గెట్స్, హాట్డాగ్స్, ప్యాకేజ్జ్ సూప్స్, చాకొలెట్స్, ఐస్క్రీం లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకొంటున్నారా? అయితే, మీకో చేదువార్త. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ను ప్రతిరోజూ తీసుకొనేవారికి క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అలాగే, క్యాన్సర్తో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. 2 వేల మంది మధ్య వయస్కులపై 10 ఏండ్లపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 32 రకాల క్యాన్సర్లు బయటపడ్డాయి. ఎక్కువ మంది గర్భాశయ, బ్రెయిన్ క్యాన్సర్కు గురైనట్టు పరిశోధకులు గుర్తించారు.