టోరంటో : కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కెనడా.. భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించిన విషయం విదితమే.
కెనడా వాసుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ రవాణా మంత్రి ఓమర్ తెలిపారు. కార్గో సర్వీసులు, మెడికల్, మిలటరీ ఫ్లైట్స్పై నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. ఈ సర్వీసులు రెండు దేశాల మధ్య కొనసాగించేందుకు అనుమతి ఇచ్చామన్నారు.