మాడ్రిడ్: మార్షల్ ఆర్ట్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. ఈ అమెరికా లెజెండరీ నటుడు తన 32వ ఏట(1973 జూలైలో) మృతిచెందారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వాడ డం వల్ల ‘సెరెబ్రల్ ఎడిమా’ వ్యాధి బారినపడ్డారని, మెదడు వాపుతో మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. కానీ, తాజాగా బ్రూస్లీ మృతికి సంబంధించి విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే ఆయన మరణించారని స్పెయిన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
కిడ్నీలు అదనపు నీటిని విసర్జించే సామర్థ్యం కోల్పోవడంతో మరణించారని పరిశోధకులు తేల్చారు. హైపోనాట్రేమి యా (రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోవడం) వల్లే బ్రూస్ లీ సెరెబ్రెల్ ఎడిమా బారినపడ్డట్టు గుర్తించారు. మరిజువానా తీసుకోవడంవల్ల అధికంగా దాహం వేయడం, ఫ్లూయిడ్ డైట్ వల్ల బ్రూస్లీ ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం, ఆల్కహాల్ సేవనంలాంటి అలవాట్ల వల్ల ఆయన కిడ్నీలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.