బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II 96 ఏండ్ల వయసులో గురువారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త యూకే ప్రజలను కలచివేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్ మిడ్ఫ్లైట్లో క్వీన్ మరణం వార్తను ప్రకటించాడు. క్యాబిన్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. విమానం లండన్లో ల్యాండయ్యేందుకు 40 నిమిషాల ముందు పైలట్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన క్లిప్లో పైలట్ క్వీన్ ఎలిజబెత్ II మరణవార్తను ప్రయాణికులకు చెప్పడం వినవచ్చు. ఈ వీడియోను బీఏ ఫ్లైట్ 178లో న్యూయార్క్లోని జేఎఫ్కే విమానాశ్రయం నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్నప్పుడు మైఖేల్ కాపిరాసో అనే ప్రయాణికుడు చిత్రీకరించాడు. క్వీన్ ఎలిజబెత్ మరణవార్త విని ఓ ఎయిర్ హోస్టెస్ దిగ్భ్రాంతి చెందింది. ఆమె కన్నీళ్లను తుడుచుకోవడం వీడియోలో చూడవచ్చు. ప్రయాణికులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
Passengers aboard this British Airways flight learned about Queen Elizabeth II’s death after the pilot made an announcement from the cockpit. https://t.co/V2dewlRyCH pic.twitter.com/oYtIQsbHaF
— Good Morning America (@GMA) September 9, 2022